రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు బండి సంజయ్ పరామర్శ

Source: దిశ,

హుజరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని బోర్నపల్లి లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంట సింధూజ(18), గంట విజయ్ (17), గంట వర్ష (14) కుటుంబాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి తో కలిసి బోర్నపల్లి విచ్చేసిన బండి సంజయ్.. సింధూజ, విజయ్ నివాసాలకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు విద్యార్థులు అతి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కుటుంబ సభ్యులకు శోకం మిగిల్చిడం కలిచివేస్తోందని బండి అన్నారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Loading

Scroll to Top